అన్నా వదినలపై దాడి | - | Sakshi
Sakshi News home page

అన్నా వదినలపై దాడి

Jun 2 2025 1:07 AM | Updated on Jun 2 2025 1:07 AM

అన్నా వదినలపై దాడి

అన్నా వదినలపై దాడి

మదనపల్లె రూరల్‌ : అన్నా వదినలపై తమ్ముడి కుటుంబం దాడి చేసిన సంఘటన ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగింది. కండ్రిగ గ్రామానికి చెందిన దంపతులు ముర్తుజా, అక్తరున్నీసాలకు గ్రామానికి సమీపంలో మామిడితోట ఉంది. అయితే వారికి తెలియకుండా ముర్తుజా తమ్ముడు షఫీవుల్లా ఇతరులకు మామిడితోటలో పంట ఒడుపుకునేందుకు విక్రయించాడు. ఈ విషయం తెలియని ముర్తుజా, అక్తరున్నీసా ఆదివారం తోటలోకి వెళ్లి పండ్లు కోశారు. దీంతో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. ఆవేశానికి లోనైన షఫీవుల్లా అన్న వదినలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల సాయంతో బాధితులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. గుర్రంకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement