పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాయితీ | - | Sakshi
Sakshi News home page

పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాయితీ

Jun 5 2025 8:42 AM | Updated on Jun 5 2025 8:42 AM

పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాయితీ

పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాయితీ

రాయచోటి : ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకం క్రింద మూడు కిలోవాట్ల పవర్‌కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 78 వేల రూపాయలు రాయితీ ఇస్తారని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ,ఈఈలు, నెడ్‌క్యాప్‌ సిబ్బంది, జిల్లాలో సోలార్‌ ఇన్‌స్టాల్‌ చేసే వెండర్లు, ఎంపీడీఓలు తదితరులతో జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా సోలార్‌ పవర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకునే రిజిస్ట్రేషన్‌లు పెరగాలని విద్యుత్‌ శాఖ సిబ్బందిని,ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.సమావేశంలో ఎస్పీడీసీఎల్‌ శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, ఈఈలు, డీఈలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆవులు, ఒంటెల వధ నిషేధం.. చట్టరీత్యా నేరం..

ఆవులు, ఆవుదూడలు, ఒంటెల వధ నిషేధం మరియు చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ‘ఆవులు, దూడలు, ఒంటెల వధఽ నిషేధం, చట్టరీత్యా నేరం’ అనే అంశంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్‌పిళ్‌లై పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement