
ఏఐని దృష్టిలో ఉంచుకోవాలి..
ఇంతవరకు జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది ఒక ఎత్తు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో జరగబోయేది మరో పెద్ద ఎత్తు. అందువల్ల ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులు ఏఐని దృష్టిలో ఉంచుకొని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయో మేధావులు సైతం సరైన అంచనా వేయలేక పోతున్నారు. అందువల్ల ప్రతి విద్యార్థి తన మేధస్సును అనునిత్యం వేగవంతం చేసుకోగలిగితేనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరు.
– కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్,
అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట