
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి..
టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్లో చేరగానే విద్యార్థులు ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తారు. ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటేనే ఉన్నత చదువుల్లో నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటర్లో కూడా పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే విద్యార్థులు సరైన మార్గంలో పయనించి చదువులో రాణించగలరు.
– మునగాల కృష్ణకుమార్, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ,
రాజంపేట