
పోయి రావమ్మా.. గంగమ్మా..
ఘనంగా ముగిసిన జాతర
రైల్వేకోడూరు అర్బన్: భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోడూరు గంగమ్మ జాతర శుక్ర వారం ముగిసింది. పట్టణంలోని పాత బజారువీధిలో గంగమ్మ మిట్టలో వెలసి ఉన్న గంగమ్మను గత రెండురోజులుగా వేలాది మంది భక్తులు దర్శించుకొన్నారు. ఉదయం 5 గంటల నుంచి గంగమ్మ మిట్టనుండి కొనసాగిన గంగమ్మ శోభాయాత్ర వైభవంగా సాగింది.భక్తులు మొక్కులు తీర్చుకొన్నారు. యువకుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఉంగరాలనగర్లోని గంగమ్మ ఘాట్ వద్ద అమ్మవారి నిమజ్జనం జరిగింది. అమ్మవారి మట్టి, పూల కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.