
శుభ్రతతో వ్యాధులు దూరం
నందలూరు: ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటించాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లి నందలూరు హరిజనవాడలో ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమ గుడ్లను లార్వా దశలోనే నిర్మూలించాలని తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని చెప్పారు. దోమకాటు నుంచి రక్షించుకోవడానికి దోమతెరలను ఉపయోగించాలన్నారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉంటే పంచాయతీ అధికారులకు తెలియజేసి క్లియర్ చేయించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. కార్యక్రంమలో ప్రభుత్వ వైద్యులు కార్తీక్, విశ్వనాథ్, సీహెచ్ఓ వెంకటనారాయణ, రాజంపేట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్ఎస్దాస్, ఆరోగ్య కార్యకర్త అంజమ్మ పాల్గొన్నారు.
ఉత్తమ భవితకు
ఆధునిక సాంకేతికత
కురబలకోట: వేగవంతంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ),మెషిన్ లర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాలను పెంచుకుని విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎల్ అండ్టీ మైండ్ ట్రీ ప్రోగ్రామ్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ చద్దా, బెంగళూరు ఐపాలెట్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్టు మనోజ్ఞ నాదెళ్ల పేర్కొన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింఽగ్ కళాశాలలో జాతీయ స్థాయిలో జరిగిన డిఫెస్టా–25లో ఆశిష్ చద్దా మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఙానం సరిపోదన్నారు. నూతన టెక్నాలజీలతో అనుసంధానం కావాల్సిన ఆవశ్యకత తప్పనిసరి అని అన్నారు. అప్పుడే విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు. కేరీర్కు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఉపాది, ఉద్యోగావకాశాలలో రాణిస్తారన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అదనపు అర్హతగా నిలుస్తాయని మరో అతిధి మనోజ్ఙ నాదెళ్ల అన్నారు. సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచానికి రక్షణ కవచంగా నిలుస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి దీనిపై అవగాహన ఉండాలన్నారు.

శుభ్రతతో వ్యాధులు దూరం