
కడప – బెంగళూరు రైల్వే ప్రస్త్తావన లేదు
రాయచోటి: రాయచోటి, కడప–బెంగుళూరు రైల్వేలైను విషయంపై కడపలో జరిగిన మహానాడులో ప్రస్తావించకపోవడం బాధాకరమని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం కడప–బెంగళూరు రైల్వేలైను రావడం ద్వారా కొద్దివరకు ప్రయోజనం ఉంటుందన్నారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే రైల్వేలైను ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జక్కుల వెంకటేష్, ఎంఆర్ ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.