భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం

May 30 2025 1:32 AM | Updated on May 30 2025 1:32 AM

భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం

భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం

నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ అధికారులకు సూచించారు. యోగ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ హాజరవుతారన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నాగభూషణం, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓఆర్‌డీ సునీల్‌కుమార్‌, డాక్టర్‌ కార్తీక్‌విశ్వనాథ్‌, ఎంఈఓలు అనంతకృష్ణ, నాగయ్య, ఏఓ మల్లికార్జున, ఏపీఓ మురళి, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement