బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం

May 2 2025 1:05 AM | Updated on May 2 2025 1:05 AM

బైకు,

బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం

ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ఘాట్‌ రోడ్డులో మునయ్యకోన సమీపంలో గురువారం సాయంత్రం మోటార్‌బైక్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో మోటార్‌బైక్‌లో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొండాపురం మండల చౌటపల్లె గ్రామానికి చెందిన హాజీ మహ్మద్‌(35), నాలుగేళ్ల తన కుమారుడు ఇమాం సాదిక్‌తో కలిసి ముద్దనూరు వైపు ప్రయాణిస్తున్నాడు. మునయ్య కోన సమీపంలోకి రాగానే జమ్మలమడుగు వైపు ప్రయాణిస్తున్న కారు మోటార్‌ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులిద్దరినీ జమ్మలమడుగుకు తరలించారు. ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హాజీ మహ్మద్‌ను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం1
1/1

బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement