
గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
చిన్నమండెం : మండల పరిధిలోని కడప–బెంగళూరు జాతీయ రహదారి మల్లూరు క్రాస్ వద్ద మామిడి కాయల మండీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు పి.సఫయాత్ఖాన్(32) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పి.సఫయాత్ఖాన్, ఇబ్రహీంఖాన్లు తమ సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో సఫయాత్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా ఇబ్రహీంఖాన్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి