అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల

May 31 2025 1:39 AM | Updated on May 31 2025 1:43 AM

రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు యూనవర్సిటీ ప్రొచాన్స్‌లర్‌ చొప్పా అభిషేక్‌రెడ్డి తెలిపారు. స్ధానిక ఏయూలోని తన చాంబరులో ఏయూఈటీ –2025 మొదటి దశ ప్రవేశ ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూఈటీ ప్రవేశపరీక్ష ఈనెల 15న నిర్వహించామన్నారు. పరీక్షను మొత్తం 1908 మంది విద్యార్ధులు రాశారన్నారు. అందులో 1239 మంది విద్యార్ధులు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన విద్యార్ధుల కోసం జూన్‌ 5, 6, 9, 10 తేదీలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అన్నమచార్య యూనివర్సిటీ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబా, రిజిస్టార్‌ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్‌ నారాయణ, డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిమ్స్‌ మార్చురీలో

గుర్తు తెలియని మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగర శివార్లలోని సర్వజన ఆసుపత్రికి తీవ్ర ఆనారోగ్యంతో బత్తల చిన్నా (35) అనే పేరుతో ఈనెల 28న ఓ వ్యక్తిని వైద్యం కోసం చేర్పించారు. అతడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలనీ రిమ్స్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

అన్నమాచార్య యూనివర్సిటీ  ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల 1
1/2

అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల

అన్నమాచార్య యూనివర్సిటీ  ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల 2
2/2

అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement