
సింహ వాహనంపై వైద్యనాథేశ్వరుడు
వల్లూరు : పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్య నాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్ఛన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు.
● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆల యంలో స్వామివారికి అభిషేకాలు, తోమాల సేవను నిర్వహించారు. శ్రీ లక్షీదేవికి అర్చనలు జరిపారు. యాగశాలార్చన, చతుస్థానార్చన, నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాయంత్రం వివిధ హోమాలను నిర్వహించారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామి వారిని కొండపై నుండి పెన్నా నది మీదుగా దివిటీల వెలుగులో గ్రామంలోకి తీసుకుని వచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధులలో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు కాయ, కర్పూరాలను భక్తితో సమర్పించారు.

సింహ వాహనంపై వైద్యనాథేశ్వరుడు