
అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలు
సిద్దవటం : సిద్దవటం రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు శనివారం సాయంత్రం అడవికి నిప్పు పెట్టారు. అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ఫారెస్టు రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తమై మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. అటవీ ప్రాంతం పచ్చదనంతో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేస్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్బాబు, ఎఫ్బీఓలు పెంచల్రెడ్డి, దీపిక, మధు, ఆది విశ్వనాథ్, ఏబీఓలు హైమావతి, నారాయణరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.