పర్యాటక కేంద్రాల్లో హోంస్టేల నిర్మాణం జరగాలి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రాల్లో హోంస్టేల నిర్మాణం జరగాలి

Apr 27 2025 12:50 AM | Updated on Apr 27 2025 12:50 AM

పర్యాటక కేంద్రాల్లో హోంస్టేల నిర్మాణం జరగాలి

పర్యాటక కేంద్రాల్లో హోంస్టేల నిర్మాణం జరగాలి

రాయచోటి: జిల్లా ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు పర్యాటక రంగం అభివృద్ధి కీలకమని, అందుకు అనుగుణంగా పర్యాటక కేంద్రాల్లో హోం స్టేల నిర్మాణం జరగాలని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పర్యాటక కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల గురించి పర్యాటక శాఖ అధికారి నాగభూషణం వివరించారు. హార్స్‌లీహిల్స్‌లో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులు, అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడం, రాయచోటిలో శిల్పారామ నిర్మాణంలో ప్రగతి తదితర అంశాలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. రాయచోటి, పీలేరు, రాజంపేటలలో నిర్మించబోయే మూడు నక్షత్రాల హోటళ్లకు ఒక్కో చోట గుర్తించిన 5 ఎకరాల భూములను పర్యాటక శాఖకు అప్పగించే దిశగా చర్యలు చేపట్టాలని సబ్‌ కలెక్టర్లను కలెక్టర్‌ ఆదేశించారు. హార్సిలీహిల్స్‌లో గిరిజన కార్పొరేషన్‌ వారు అరకు కాఫీ కోసం గుర్తించిన స్థలాన్ని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. అక్కడే లేపాక్షి స్టాల్‌ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి పర్యాటక శాఖకు అందజేయాలన్నారు. స్వయం సహాయక బృందాలతో హోమ్‌ స్టేలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పీడీ డీఆర్‌డీఏను ఆదేశించారు. గ రాయచోటిలోని శిల్పారామం నిర్మాణంలో పురోగతి సాధించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శరాజేంద్రన్‌, మదనపల్లె రాజంపేట సబ్‌ కలెక్టర్లు మేఘస్వరూప్‌, నైదియాదేవి, పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌, ఏపీ టీడీసీ ఈఈ సుబ్రమణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, పీడీ డీఆర్‌డీఏ సత్యనారాయణ, ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లా అధికారి రాము, జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌, మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

● ప్రభుత్వ పథకాల్లో వందశాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఫిజబిలిటీ నివేదిక వెంటనే పంపాలని సూచించారు. జిల్లాలో పచ్చిమేత పెంపకానికి డివిజన్‌, మండలస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, డికేటీ, ప్రైవేటు భూములను ప్రతి మండలంలో కనీసం 3 వేల ఎకరాలను గుర్తించాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement