నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం | YSRCP Political Advisory Committee Meeting on july 29: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం

Jul 29 2025 2:32 AM | Updated on Jul 29 2025 2:34 AM

YSRCP Political Advisory Committee Meeting on july 29: Andhra pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement