మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌ | Ys Jagan Shows Humanity | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న వైఎస్‌ జగన్‌

May 29 2025 2:34 PM | Updated on May 29 2025 6:33 PM

Ys Jagan Shows Humanity

వృద్ధురాలిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వారధి వద్ద వృద్ధురాలిని బస్సు ఢీకొనడంతో రెండు కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో శిశువిహార్‌ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్‌ జగన్‌.. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.

వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్‌కు ఆయన అప్పగించారు. ఎమ్మెల్సీ అరుణ్‌.. 108కు పలుమార్లు ఫోన్‌ చేసినా కానీ సిబ్బంది స్పందించలేదు. దీంతో ఎమ్మెల్సీ అరుణ్‌.. అటు వైపుగా వెళ్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌లో వృద్ధురాలిని విజయవాడ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేంతవరకూ ఎమ్మెల్సీ అరుణ్‌ అక్కడే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement