కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి | Srikakulam Kashi Bugga Temple Stampede: 9 Dead, Several Injured in Tragic Incident | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి

Nov 1 2025 12:06 PM | Updated on Nov 1 2025 2:21 PM

Srikakulam Kashi bugga Venkateshwara temple Stampade Incident

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉ‍న్న రెయిలింగ్‌ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది. 

అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. 

మృతులు వీరే..

  • టెక్కలి రామేశ్వరం చెందిన ఏదూరి చిన్నమ్మ.
  • టెక్కలికి చెందిన రాపాక విజయ.
  • దుక్కవాని పాటికి చెందిన మురిపింటి నేలమ్మ.
  • శివరాంపురానికి చెందిన యశోదమ్మ.
  • బెల్లిపటియాకు చెందిన దువ్వు రాజేశ్వరిగా గుర్తించారు.  

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
కాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement