దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Special Trains For Diwali - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

మచిలీపట్నం–కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (07067) నవంబర్‌ 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07068) నవంబర్‌ 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబర్‌ 1వ తేదీల్లో రాత్రి 8.00 గంటలకు కర్నూలు సిటీలో బయల్దేరుతుంది.  

నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07455) ఈ నెల 31, నవంబర్‌ 7, 14 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది.  

సికింద్రాబాద్‌–విజయవాడ ప్రత్యేక రైలు (07456) నవంబర్‌ 1, 8, 15 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. 

సికింద్రాబాద్‌–దానాపూర్‌ ప్రత్యేక రైలు (07460) నవంబర్‌ 7వ తేదీ ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07459) నవంబర్‌ 11న ఉదయం 11.00 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది.

విశాఖపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక వారాంతపు రైలు (08579) నవంబర్‌ 3, 10, 17 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) నవంబర్‌ 4, 11, 18 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top