అవార్డులతో విద్యుత్‌ సంస్థల బాధ్యత పెరిగింది

Peddireddy Ramachandra Reddy On power companies - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థలకు ఈ ఏడాది దక్కిన ప్రతి­ష్టాత్మక అవార్డులు వినియోగదారులకు మరింత మెరు­గైన సేవలందించే బాధ్య­తను మరింత పెంచాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీ సీపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో విజ­యవాడలో ఈ నెల 28న ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలు, నెడ్‌­క్యాప్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, వివిధ విభాగాల ఉద్యో­గులతో ఉన్నత­స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణ­యిం­చారు.

ఈ సందర్భంగా ఆది­వారం ఆయన విద్యుత్‌ శాఖ ఉన్నతా­ధి­కారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీ­క్ష నిర్వహించారు. రాష్ట్రపతి నుంచి అందుకున్న నేషనల్‌ ఎన­ర్జీ కన్జర్వేషన్‌ అ­వార్డు దేశంలో ఏపీ ఖ్యాతిని మరింతగా పెంచిందని మంత్రి అన్నారు. 

ఏకైక రాష్ట్రం ఏపీ
ఇంధన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎనర్షియా సమ్మిట్‌లో ఏపీ మరో 3 అవార్డులను గెలుచుకుందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఏపీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌­మి­షన్‌ యుటిలిటీగా, ఉత్తమ పునరు­త్పాదక సంస్థల్లో ఒకటిగా నెడ్‌క్యాప్‌ 
నిలిచా­య­­న్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top