సాక్షి, ఒంగోలు: చంద్రబాబును సంతృప్తిపరచడం కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేయడం సరికాదని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (మంగళవారం) ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో జగన్ని బతిమాలి టికెట్ తీసుకున్నాడని ప్రజలకు పనికిరాని నాయకుడు ఎంపీ మాగుంటని చెవిరెడ్డి ధ్వజమెత్తారు.
చెవిరెడ్డి మాట్లాడుతూ.. మాగుంట ఎంపీ ల్యాడ్స్ నిధులు కనీసం ఎనిమిది శాతం కూడా ఖర్చు చేయలేదు. ఎంపీ పదవిని అడ్డుపెట్టుకొని సారాయి అమ్ముకుంటున్నారు. ఒంగోలు పార్లమెంటులో కనీస అభివృద్ధి సైతం జరగలేదు. అని అన్నారు. మాగుంటవి దిగజారుడు మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు.


