పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి మృతి | AP: Man caught by police playing poker dies | Sakshi
Sakshi News home page

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి మృతి

Sep 15 2025 4:01 PM | Updated on Sep 15 2025 6:02 PM

AP: Man caught by police playing poker dies

అనంతపురం జిల్లా :  పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ జిల్లాలోని  సింగనమల మండలం నాగలగుడ్డం తండాకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. సింగనమల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలో కోల్పోయాడు. దాంతో అతని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.  మృతదేహంతో సింగనమల పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. నిన్న(ఆదివారం, సెప్టెంబర్‌ 14 వ తేదీ) పేకాట ఆడుతూ రామకృష్ణ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. 

అయితే ఈ ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కొట్టడంతోనే రామకృష్ణ చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్ట్రెచర్‌పై పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు తీవ్రంగా కొట్టిన కారణంగా సృహ కోల్పోయిన రామకృష్ణను ఆస్పత్రిలో చేర్పించారని, కానీ అతను చనిపోయాడని బంధువులు అంటున్నారు. దీనికి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Singanamala: పోలీసులు కొట్టడం వల్లే రామకృష్ణ మృతి చెందాడని బంధువుల ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement