2,905 కేసులు.. 16 మంది మృతి

AP Corona Update 2905 Cases Recorded On October 29 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 88,778 మందికి పరీక్షలు నిర్వహించగా..  2,905 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం పరీక్షల సంఖ్య  78,62,459కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,243మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు 784752 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్ర‌స్తుతం 26268 యాక్టివ్ కేసులున్న‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 మంది కోవిడ్తో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,659 కి చేరుకుంది. (చదవండి: కరోనా వైరస్‌ మలి దశ పంజా!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top