విజయవాడలో డయేరియాకు మరొకరు బలి | Diarrhea Outbreak, Another Death Due To Diarrhea In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయవాడలో డయేరియాకు మరొకరు బలి

Sep 13 2025 9:30 AM | Updated on Sep 13 2025 10:14 AM

Another Death Due to Diarrhea in Vijayawada

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడలో విజృంభిస్తున్న డయేరియాకు మరొకరు బలయ్యారు. గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న నరసింహ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గద్వాల నరసింహ(38) భార్యతో విభేదాలు రావడంతో ఒక్కడే ఉంటున్నాడు. నరసింహ ఇంటి కింద భాగంలో ఉంటుండగా, అతని తమ్ముడి కుటుంబం ఇంటి పైభాగంలో ఉంటోంది. 

గత 4 రోజుల నుంచి ఆ ఇంటిల్లిపాది డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. నరసింహ తమ్ముడి కుమార్తె­కు కూడా వాంతులు, విరేచనాలు కావడంతో వారి కుటుంబ సభ్యులంతా 2 రోజుల నుంచి పాపతో పాటు హాస్పిటల్‌లోనే ఉంటున్నారు. శుక్రవారం నరసింహ వాంతులు, విరేచనాలతో నీరసించిపోయా­డు. సాయంత్రానికి అతని పరిస్థితి విషమించడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement