Andhra Pradesh: Civils 2021 Qualified Candidates Meet CM Ys Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్‌ సర్వీసెస్‌ విజేతలు

Jun 13 2022 7:28 PM | Updated on Jun 13 2022 8:34 PM

Andhra Pradesh: Civils 2021 Qualified Candidates Meet CM Ys Jagan - Sakshi

ఏపీ నుంచి సివిల్స్‌ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు సీఎం జగన్‌ను కలిశారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021కి ఎంపికైన విజేతలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు వాళ్లు. ఏపీ నుంచి సివిల్‌ సర్వీసులకు ఎంపికైన ఆ అభ్యర్ధులతో ముచ్చటించి, పేరుపేరునా వారిని అభినందించారు సీఎం జగన్‌.

ఈసారి సివిల్స్‌ విజేతల్లో.. నంద్యాలకు చెందిన యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు లభించడం విశేషం. విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్ కు 28, కాకినాడ అమ్మాయి కొప్పిశెట్టి కిరణ్మయికి 56, భీమవరంకు చెందిన శ్రీపూజకు 62వ ర్యాంకు, విజయవాడకు చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, నగరికి చెందిన మాలెంపాటి నారాయణ అమిత్ కు 70, రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ కు 99వ ర్యాంకు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement