సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం): పడ్నా లిఖ్నా అభియాన్(అక్షరాస్యత కార్యక్రమం)లో భాగంగా చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో పడ్నా లిఖ్నా అభియాన్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదువుకుందాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువు లేని 15 ఏళ్ల వయసు దాటిన వారిని బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా అడుగులేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే అన్ని రాష్ట్రాల్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, అందుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులను విద్యాభివృద్ధికి కేటాయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికి 26 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సగానికి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, పాఠశాల విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వైస్ చైర్మన్ విజయశారదరెడ్డి, వయోజన విద్యా సంచాలకులు వై.జయప్రద తదితరులు పాల్గొన్నారు.
నూరుశాతం అక్షరాస్యత దిశగా అడుగులు..
Published Thu, Apr 8 2021 4:44 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement