సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. 18 ఏళ్ల వయసు పైబడినవారిలో 50 శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో 4,88,70,313 డోసులు వేశారు. ఇందులో మొదటి డోసు వేయించుకున్నవారు 3,11,81,733 మంది. కాగా, రెండు డోసులు వేయించుకున్నవారు 1,76,88,580 మంది ఉన్నారు. గురువారం ఒక్కరోజే 3.50 లక్షల మందికి టీకా వేశారు. 3–4 రోజుల్లో 5 కోట్ల డోసుల టీకా మార్కును దాటే అవకాశం ఉంది.
మొదటి డోసు వేయించుకున్నవారు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 34,69,498 మంది ఉన్నారు. రెండు డోసులు వేయించుకున్నవారు కూడా ఆ జిల్లాలోనే అత్యధికంగా 16,64,507 మంది ఉండటం విశేషం. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 8,02,895 మందికి రెండు డోసులు వేశారు. ఇప్పటికే జనాభాలో ఎక్కువ మందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే 18 ఏళ్లు దాటినవారికి రెండు డోసుల టీకా పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 4.88 కోట్ల డోసుల టీకా పూర్తి
Published Fri, Oct 22 2021 3:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement