ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు | 22517 New Coronavirus Positive Cases Recorded In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు

May 15 2021 6:49 PM | Updated on May 15 2021 7:18 PM

22517 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,535 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,11,320 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,271కు చేరింది. గడిచిన 24 గంటల్లో 18,739 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 94 వేల 582 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,07,467 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,78,80,755 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement