ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు | 21672 Coronavirus Active Cases In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

Nov 3 2020 6:26 PM | Updated on Nov 3 2020 6:56 PM

21672 Coronavirus Active Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యాదికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా గడిచిన 24 గంటల్లో 84,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,849 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,30,731కి పెరిగింది. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా కరోనా నుంచి కొత్తగా 3,700 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,02,325గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,734కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,672 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement