ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 377 కరోనా కేసులు | Andhra Pradesh: 377 New Corona Cases Reported In A Day | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 377 కరోనా కేసులు

Jan 5 2021 7:18 PM | Updated on Jan 5 2021 7:57 PM

Andhra Pradesh: 377 New Corona Cases Reported In A Day - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా, 377 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883587కి చేరింది. కరోనా బారినపడి సోమవారం చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7122 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (చదవండి: కరోనా‌ వ్యాక్సిన్‌ పంపిణీకి ఏపీ సిద్ధం)

గడచిన 24 గంటల్లో 278 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,427 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు  స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,20,53,914 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,038 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చదవండి: వ్యాక్సిన్‌ వచ్చేసింది : రిజిస్ట్రేషన్‌ ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement