ఏపీలో కొత్తగా 997 కరోనా కేసులు

997 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 997 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,99,812 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో 282 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,498 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి గత 24 గంటల్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7,210 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 6,104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,50,21,364 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి:
ముంచుకొస్తున్న కరోనా.. భారీగా కేసులు!
మాస్క్‌ వాడకపోతే జరిమానా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top