
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 91,629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18,767 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,77,932 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 104 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,126కు చేరింది. గడిచిన 24 గంటల్లో 20,109 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 13 లక్షల 61 వేల 464 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,09,237 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,86,17,387 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.