సేవాఘడ్లో ఘనంగా ఆలయ రజతోత్సవాలు
గుత్తి రూరల్: మండలంలోని సేవాఘఢ్లో వెలసిన సంత్ సేవాలాల్ మహరాజ్, మాత జగదాంబ ఆలయ రజతోత్సవాలు మంగళవరాం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకుడు ఆసూరి మారుతీప్రసాద్ ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. బుధవారం జగదాంబ ఆలయంలో వేంకటేశ్వర, ఉమామహేశ్వర స్వామి కల్యాణం, అష్టలక్ష్మి యంత్రార్చన, లక్ష దీపోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమంలో సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, సభ్యలు రవీందర్నాయక్, వెంకటరమణనాయక్, మీటునాయక్, నారాయణనాయక్, శివనాయక్, నారాయణనాయక్, రామాంజులనాయక్, సుధాకర్నాయక్, డాక్టర్.శ్రీరాములునాయక్, మల్లికార్జున, మహారాష్ట్రకు చెందిన మోతీచంద్చౌహన్, కర్ణాటకకు చెందిన మహరాజ్ పాల్గొన్నారు.


