బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరులో వెలసిన స్వామి ఉరుసు ఈ నెల 7న ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకూ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. 7 గంధం, 8న ఒకటవ దీపారాధన, 9న రెండవ దీపారాధన, 10వ తేదీ దేవుడి సవారీ, 11న జియారత్ ఉంటుంది. హిందూ, ముస్లింల ఐఖ్యతకు మారుపేరుగా నిలిచిన దర్గాహోన్నూరు ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దర్గా వద్ద పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం బళ్లారి, ఉరవకొండ, కణేకల్లు, రాయదుర్గం, అనంతపురం నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.


