‘స్టాంప్‌’ కుంభకోణంపై చంద్రబాబు నోరు విప్పాలి | - | Sakshi
Sakshi News home page

‘స్టాంప్‌’ కుంభకోణంపై చంద్రబాబు నోరు విప్పాలి

Jun 29 2025 2:42 AM | Updated on Jun 29 2025 2:42 AM

‘స్టాంప్‌’ కుంభకోణంపై  చంద్రబాబు నోరు విప్పాలి

‘స్టాంప్‌’ కుంభకోణంపై చంద్రబాబు నోరు విప్పాలి

అనంతపురం టవర్‌క్లాక్‌: నకిలీ స్టాంపుల కుంభకోణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు విప్పాలని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తెల్గీ కుంభకోణాన్ని తల దన్నేలా ప్రస్తుత స్టాంపుల కుంభకోణం ఉందన్నారు. ఈ స్కామ్‌ను ఒక వ్యక్తిపై తోసి సురేంద్రబాబు తప్పించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్‌బీఐ, ఫైనాన్స్‌ మినిస్టర్‌, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ స్కామ్‌ సంబంధించి 40 డాక్యుమెంట్లతో రెండు డాక్యుమెంట్లతోనే రూ.900 కోట్లు, మరో డాక్యుమెంటులో రూ.700 కోట్లు, ఇంకో డాక్యుమెంట్‌లో రూ.20 కోట్ల వరకు అవకతవకలు పాల్పడినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు అనంతపురంలో కార్యాలయం ఉంటే కళ్యాణదుర్గంలో డాక్యుమెంట్లు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రాకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్‌నూ విచారణ చేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరిందా లేదా అని చూడాలన్నారు.

ధాబా నిర్వాహకురాలిపై దాడి

గుత్తి రూరల్‌: ధాబాను తగులబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులు.. అడ్డుకోబోయిన నిర్వాహకురాలిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు... ఊబిచెర్ల గ్రామానికి చెందిన ఓబులేసు, అంజలి దంపతులు గ్రామ శివారు 44వ నంబరు జాతీయ రహదారి పక్కన ధాబా హోటల్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాబా మూసివేసిన అనంతరం అంజలి అక్కడే నిద్రించింది. అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ధాబాలోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడికి అంజలి నిద్రలేచి కేకలు వేసి,అడ్డుకుంది. దీంతో వారు అంజలిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కేకలు విని సమీపంలోని వారు వస్తుండటం గమనించిన దుండగులు ద్విచక్రవాహనం వదిలి పారిపోయారు. గాయపడిన అంజలిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు దొంగలా.. లేక ఇతర కారణాలతో దాడి చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement