
మొరాయించిన తిరుపతి ప్యాసింజర్ రైలింజిన్
గుంతకల్లు: గుంతకల్లు–తిరుపతి ప్యాసింజర్ (57403) రైలింజిన్ మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్టారు. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ రైలు ఉదయం 8.09 గంటలకు బయలుదేరింది. హనుమాన్ సర్కిల్ రైల్వేస్టేషన్ దాటుకుని గూళ్యపాళ్యం రైల్వేస్టేషన్కు (8.35 గంటలకు) చేరుకోగానే రైలింజిన్లో సాంకేతిక సమస్య తలెత్తి నిలబడిపోయింది.లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ ఎంత ప్రయత్నించినా రైలు ముందుకు కదలకపోవడంతో గుంతకల్లులోని కంట్రోల్ ఆఫీసుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు గుంతకల్లు నుంచి మరో రైలింజిన్ను గూళ్యపాళ్యం రైల్వేస్టేషన్కు పంపారు. రైలుకు దాన్ని జత చేసి ముందుకు సాగనంపారు. ఈ క్రమంలో గంటన్నరకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.