
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెర
నిరుద్యోగులకు మోసం
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసగించాయి. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.వలంటీర్లకు రూ.10 వేలు వేతనం అన్నారు...ఉన్నవారందరినీ పీకేశారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసి వాటిపై ఆధారపడ్డ సిబ్బందిని రోడ్డుపాలు చేశారు.
– కసాపురం రమేష్, జిల్లా కార్యదర్శి,
డీవైఎఫ్ఐ
సాయం కోసం ఎదురు చూస్తున్నాం
కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాం. గత ఏడాది కూడా పెట్టుబడి సాయం మంజూరు కాలేదు. ప్రస్తుతం రైతుల వెరిఫికేషన్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. మా ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందో లేదో చూడాలి.
– మునయ్య, ముచ్చుకోట,
తాడిపత్రి మండలం
పేదలకు శాపంగా మారిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పేద ప్రజలకు ఏ మేలూ జరగలేదు. సంక్షేమ పథకాల ఊసే లేదు. పట్టణ, గ్రామ పరిధిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిన మాటను చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను సైతం అమలు చేయకుండా దగా చేశారు. పేద ప్రజలకు ఈ ప్రభుత్వం శాపంలా మారింది. –చిరంజీవి యాదవ్,
సీపీఐ పట్టణ కార్యదర్శి, తాడిపత్రి
బాబు జీవితమంతా మోసమే
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలను ఇచ్చి ప్రజలను వంచించారు. గత ఎన్నికలకు ముందు సూపర్సిక్స్తో పాటు 145 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. చంద్రబాబు జీవితమంతా పచ్చి మోసం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి సంక్షేమం అందించారు. మేనిఫెస్టో అమలు చేయని పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలి. ఆ దిశగా పార్లమెంట్లో చర్చ జరగాలి.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెర

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెర

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెర