ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం కండి | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం కండి

May 30 2025 1:33 AM | Updated on May 30 2025 1:33 AM

ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం కండి

ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం కండి

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

బుక్కరాయసముద్రం: ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బీకేఎస్‌ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి జెడ్పీ హైస్కూల్‌లో గురువారం వ్యవసాయ, ఏపీ సీడ్స్‌, మార్క్‌ఫెడ్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రైతుల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 100 శాతం క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విత్తనశుద్ధి వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, ఏపీసీడ్స్‌ డీఎం సుబ్బయ్య, మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి, తహసీల్దార్‌ పుణ్యవతి, సెరికల్చర్‌ అధికారి ఓబిలేసు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి

రైతులు పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం అందింపుచ్చుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ‘జిల్లాస్థాయి వికసిత కృషి సంకల్ప అభియాన్‌’ ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. వికసిత కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమం జూన్‌ మొదటి వారం వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లేశ్వరి, ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రాజన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement