
‘ఆర్డీటీ’ పరిరక్షణకు పాదయాత్ర
కళ్యాణదుర్గం: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన ఆర్డీటీ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలనే డిమాండ్తో జూన్ 4వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులతో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామితో కలసి గురువారం ఆయన సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీటుగా పేదరిక నిర్మూలనకు ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ను ప్రభుత్వాలు అడ్డుకున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యక్తపై ప్రజలను చైతన్యపరిచేందుకు సంస్థ సేవలను జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి జూన్ 4న పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా మొత్తం 62 గ్రామాలలో 209 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందన్నారు. ఉద్యమానికి కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, తదిరాలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పల్లెపల్లె నుంచి ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన ప్రతి కుటుంబమూ ఓ ఉప్పెనలా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరప్ప, ఎంపీపీ ఆంజనేయులు, మున్సిపాలిటీ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, ఎంఎస్ హనుమంతరాయుడు, కంబం చంద్రశేఖర్రెడ్డి, కె.హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, పార్టీ అనుబంధ విభాగాల కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణ్ణ్ణమూర్తి, హనుమంతరెడ్డి, రామాంజినేయులు, నాయకులు గోపాలరెడ్డి, మంజునాథ్, తిప్పేస్వామి, ఫయాజ్, దాదు, కిరణ్, నరసింహులు, చరణ్, పాతలింగ, భాస్కర్, షెక్షావలి, మురళి, రాజు, పాండు, ఇబ్రహీం, అజయ్, ప్రతాప్, రామిరెడ్డి, మల్లికార్జున, తిమ్మారెడ్డి, కిరీటి యాదవ్, దేవ, మల్లి, సుధాకర్, నారాయణస్వామి, కేశవ్ గౌడ్, జానీ, జయరామిరెడ్డి, సుబ్బరాయుడు, గంగాధర్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ 4న గొంచితండా నుంచి ప్రారంభం
62 గ్రామాలు....209 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర
మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య