
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పుట్లూరు: మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన తోలు కృష్ణయ్య, సరస్వతి దంపతుల రాజకుళ్లాయప్ప (24) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కృష్ణయ్య, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, కొన్నేళ్ల క్రితమే కుటుంబ పెద్ద కృష్ణయ్య మృతి చెందాడు. అప్పటి నుంచి చిన్న కుమారుడు రాజకుళ్లాయప్ప వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకూ రాజకుళ్లాయప్ప ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి తల్లి సరస్వతి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పాము కాటుతో మహిళ...
బెళుగుప్ప: మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన పాటిల్ ప్రభాకర్రెడ్డి భార్య సావిత్రమ్మ(60) పాము కాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి సమీపంలోనే ఉన్న తమ తోటలో గురువారం ఉదయం కూలీలతో పనులు చేయిస్తున్న భర్తకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకెళ్లిన ఆమె అనంతరం కూలీలతో కలసి కలుపు తీత పనుల్లో నిమగ్నమైంది. ఆ సమయంలో రక్త పింజరి కాటు వేసింది. వెంటనే విషయాన్ని గుర్తించిన కూలీలు పామును కట్టెలతో కొట్టి చంపేశారు. సావిత్రమ్మను ఆగమేఘాలపై అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
డీసీసీబీ చైర్మన్గా ముంటిమడుగు కేశవరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా ముంటిమడుగు కేశవరెడ్డి నియమితులైనట్లు సీఈఓ కె.సురేఖారాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశవరెడ్డి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిసియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ జారీ చేశారన్నారు.
మహానాడులో జీఆర్పీ హెచ్సీ హల్చల్
సాక్షి, టాస్క్ఫోర్స్: కడపలో జరుగుతున్న మహానాడులో గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వాసు హల్చల్ చేశారు. రెండో రోజు (28వ తేదీ) కార్యక్రమాల్లో పాల్గొన్న వాసు.. టీడీపీ నేతలు ఇసురాళ్లపల్లికి చెందిన కిట్టుయాదవ్, లచ్చానుపల్లికి చెందిన రామాంజినేయులుతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ నెల 11న గుత్తి టీడీపీ సీనియర్ నేత కోనంకి కృష్ణపై పార్టీ కార్యాలయంలోనే వాసు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కోనంకి కృష్ణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి వాసు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ నేతగా చెలామణి అవుతున్నాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడి మృతి