మరణించిన వారికీ ‘ఉపాధి’ | - | Sakshi
Sakshi News home page

మరణించిన వారికీ ‘ఉపాధి’

May 28 2025 11:42 AM | Updated on May 28 2025 11:42 AM

మరణించిన వారికీ ‘ఉపాధి’

మరణించిన వారికీ ‘ఉపాధి’

పుట్లూరు: మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు తారస్థాయికి చేరాయి. జాబ్‌కార్డు ఉంటే చాలు పనికి వెళ్లకపోయినా హాజరు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు సిబ్బంది ఏడాదిలో జాబ్‌కార్డుకు రూ.30 వేలు జమచేయించి లబ్ధిదారుడికి రూ.15 వేలు ఇచ్చి మిగతాది దోచుకుంటున్నారు. దీంతోపాటు క్షేత్ర స్థాయిలో అప్పటికే పూర్తైన పనులను పదే పదే పరిశీలించి కొలతల ఆధారంగా మళ్లీ చెల్లింపులు చేస్తున్నారు. గ్రామాల్లో లేని వారు, ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లపై మస్టర్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. సామాజిక తనిఖీ బృందాలు సైతం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి వెళ్లిపోతుండటంతో ఉపాధి సిబ్బంది అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. జంగంరెడ్డిపేటలో ‘ఆత్మలకు’ ‘ఉపాధి’ కల్పించిన విషయంపై పుట్లూరు ఎంపీడీఓ అలివేలమ్మ వివరణ కోరగా.. ఆమె స్పందించారు. మరణించిన వారి పేరుపై బిల్లులు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement