
తల్లుల వేదన అంతా ఇంతా కాదు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచిన వారం రోజుల్లోనే ‘అమ్మఒడి’ పేరుతో రూ.15 వేలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కానీ 2024 ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తానన్న బాబు.. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తున్నా ‘తల్లికి వందనం’ మాటే ఎత్తడం లేదు. పైగా ఒక్కో రోజు ఒక్కోమాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారికే అని ఒకసారి.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులందరికీ అని మరోసారి.. ఇటీవల మార్గదర్శకాల్లో ఒకరికే అని ఇచ్చి తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4 లక్షల మంది చిన్నారుల తల్లులు ప్రభుత్వ సాయం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.