
తగ్గని వాంతులు.. విరేచనాలు
ఉరవకొండ: స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి. సాధారణ రోజుల్లో ఓపీ 400 కాగా, ఈ వారం రోజులుగా 500కు చేరుకోవడం గమనార్హం. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పిల్లలు, వృద్దులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. కేవలం వాంతులు, విరేచనాలకు సంబంధించి రోజూ 60 నుంచి వంద మంది ఆస్పత్రి పాలవుతుండడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.
లోపం ఎక్కడ?..
ఉరవకొండలో అధిక శాతం ప్రజలు వాంతులు, విరేచనాలతోనే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అయితే ఇందుకు కలుషిత నీరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఉరవకొండలోని పలు కాలనీలకు తాగునీరు సరఫరా అవుతోంది. కొన్ని రోజులుగా ఈ నీరు రంగుమారి వస్తోంది. దీనికి తోడు మేజర్ పంచాయతీ పరిధిలో ఎటు చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది.
ఉరవకొండలో రోజురోజుకూ పెరుగుతున్న అతిసారం బాధితుల సంఖ్య