అడిషనల్‌ ఎస్పీ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ ఎస్పీ సేవలు చిరస్మరణీయం

Jun 1 2025 12:24 AM | Updated on Jun 1 2025 12:24 AM

అడిషనల్‌ ఎస్పీ సేవలు చిరస్మరణీయం

అడిషనల్‌ ఎస్పీ సేవలు చిరస్మరణీయం

అనంతపురం: అడిషనల్‌ ఎస్పీ డీవీ రమణమూర్తి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ జగదీష్‌ అన్నారు. అడిషనల్‌ ఎస్పీ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారని అడిషనల్‌ ఎస్పీని కొనియాడారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరి ప్రజలకు సేవలు అందించడం సంతృప్తి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ షేక్‌ ఇలియాజ్‌ బాషా, డీఎస్పీలు రవిబాబు, వెంకటేశులు, శ్రీనివాస్‌, మహబూబ్‌ బాషా, నీలకంఠేశ్వర రెడ్డి (ఏఆర్‌), గురునాథ్‌ బాబు, ప్రసాదరెడ్డి, బీవీ శివారెడ్డి, ప్రభాకర్‌, మహేశ్వర్‌రెడ్డి, ఏఓ రవిరాం నాయక్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

● ఉద్యోగ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్‌ ఘనంగా సత్కరించారు. రామాంజినేయులు (ఎస్‌ఐ) జిల్లా స్పెషల్‌ బ్రాంచి, చంద్రశేఖర్‌ (ఎస్‌ఐ) ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, అనంతపురం, శ్రీధర్‌ బాబు (ఏఎస్‌ఐ) యాడికి, శివశంకర్‌ (ఏఎస్‌ఐ) అనంతపురం టూటౌన్‌, ఈశ్వర్‌ (ఏఎస్‌ఐ) కణేకల్లు, అయూబ్‌ బాషా, హెడ్‌కానిస్టేబుల్‌– వన్‌టౌన్‌ అనంతపురం, వెంకటేశులు కానిస్టేబుల్‌– ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, అనంతపురం ఉద్యోగ విరమణ చేశారు. వీరిందరికీ ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement