ఆర్‌ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన మృతదేహం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన మృతదేహం గుర్తింపు

Jun 6 2025 6:29 AM | Updated on Jun 6 2025 6:29 AM

ఆర్‌ఎ

ఆర్‌ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన

ఉరవకొండ: ఓ ఆర్‌ఎంపీ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం సిద్దారాంపురం గ్రామానికి చెందిన ఆవుల గోపాలరెడ్డి, సువర్ణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు మంజునాథ్‌రెడ్డి ఉన్నారు. కుమారుడు గ్రామంలోనే ఆర్‌ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం మంజునాథరెడ్డి (30)పై పడింది. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడికి పెళ్లి చేయాలని తల్లి సంబంధాలు చూస్తోంది. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో పాటు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులతో చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి పెంచుకున్న మంజునాథ్‌ ఈ నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 5న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉరవకొండ మండలం పెన్నహోబిలం గుట్టల్లో కాలిపోయిన ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో సీఐ మహనంది, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెన్నహోబిలంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడిని మంజునాథ్‌గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

టీడీపీ నేతల ఇళ్ల వద్ద విత్తన కాయల రిజిస్ట్రేషన్‌!

బుక్కరాయసముద్రం: మండలంలోని చెన్నంపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన ఇళ్ల వద్ద వ్యవసాయ సిబ్బంది కూర్చొని విత్తన కాయల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారని వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటరెడ్డి ఆరోపించారు. గ్రామంలో సచివాలయం ఉండగా వ్యవసాయ అధికారులు టీడీపీ నేతలు చెప్పిన చోట రిజిస్ట్రేషన్లు చేపట్టడం దారుణమన్నారు. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టి విత్తన పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని కోరారు.

బ్రెయిన్‌ డెడ్‌ బాలుడి అవయవ దానం

కళ్యాణదుర్గం రూరల్‌: బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ బాలుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. మృతిచెందిన తర్వాత తమ కుమారుడు మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడనే భావంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మరీ అవయవదానానికి అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి... కళ్యాణదుర్గం మండలం గరుడాపురం – కొత్తూరు గ్రామాల మధ్య మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమై అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహరి (18) బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గురువారం వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు అనసూయమ్మ, ఈరన్న, సోదరి సింధూజ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీవన్‌ధాన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు... శ్రీహరి అవయవాలను దానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయవచ్చని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించడంతో అంతటి దుఃఖంలోనూ వారు అంగీకారం తెలిపారు. దీంతో శ్రీహరి గుండె, కళ్లు, కిడ్నీలను జీవన్‌దాన్‌ ప్రతినిధులు సేకరించి అత్యవసరమైన రోగుల కోసం మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఇంటర్‌ వరకూ చదువుకున్న శ్రీహరి... కొత్తూరు గ్రామంలోనే తల్లిదండ్రులకు వ్యవసాయ వనుల్లో చేదోడుగా ఉండేవాడు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన శ్రీహరి తల్లిదండ్రులను వైద్య సిబ్బంది అభినందించారు.

ఆర్‌ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన1
1/1

ఆర్‌ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement