
● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!
బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా మాంసం కోసం పెంచే పొట్టేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ బక్రీద్ పండుగ నేపథ్యంలో విక్రయించే జీవాలకు బరువుతో పని లేదు. కేవలం రూపం, వాటి ఆరోగ్యాన్ని మాత్రమే చూస్తారు. దీంతో సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండుగ ఎలా చేసుకోవాలని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఆత్మకూరు:

● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!

● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!

● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!