మాట తప్పిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మాట తప్పిన కూటమి ప్రభుత్వం

Jun 9 2025 6:55 AM | Updated on Jun 9 2025 6:55 AM

మాట త

మాట తప్పిన కూటమి ప్రభుత్వం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎస్జీటీల బదిలీలు మ్యానువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా చేపడతామన్న ప్రభుత్వం మాట తప్పిందంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన గళం వినిపించారు. ఇందులో భాగంగా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ గత నెల 19, 20 తేదీల్లో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంగా ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. వేలాది మంది బదిలీలు కావా ల్సిన నేపథ్యంలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులైనా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ గౌడ్‌, ‘ఆప్టా’ జిల్లా అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, యూటీఎఫ్‌ లింగమయ్య, గోవిందరాజులు, జయ చంద్రారెడ్డి, సుధాకర్‌, ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, ఎ. హరి ప్రసాద్‌ రెడ్డి, ‘అపస్‌’ ఎర్రిస్వామి, ఏపీటీఎఫ్‌ వెంకటేశులు, సిరాజుద్దీన్‌, ఏపీటీఎఫ్‌ (1938) శ్రీనివాస్‌ నాయక్‌, శ్రీనివాసులు, విశ్వనాథ్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, పీఆర్టీయూ విష్ణు వర్ధన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, తిమ్మారెడ్డి కేశవరెడ్డి, హెచ్‌ఎం అసోసియేషన్‌ జయరామిరెడ్డి, ఎస్‌ఎల్‌ టీఏ శివానందరెడ్డి, పీడీ అసోసియేషన్‌ శ్రీనివాసులు, కేశవ మూర్తి, నరసింహారెడ్డి, ప్రభాకర్‌, ఎన్‌టీఏ జయరాం నాయక్‌, ఆర్జేయూపీ రామాంజనేయులు, బీసీటీఏ వరదరాజులు, గిరిజన ఉపాధ్యాయ సంఘం శివయ్య, రవీంద్ర నాయక్‌, పీఎస్‌హెచ్‌ం అసోసియేషన్‌ మర్రి స్వామి, ఆర్‌యూపీపీ ఎర్రి స్వామి, తులసి రెడ్డి, వైఎస్సార్‌ టీఏ నాయకులు వెంకటరమణ, రవీంద్రారెడ్డి రాధాకృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, బీటీఏ ఓబులేసు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఎస్జీటీల కౌన్సెలింగ్‌

మ్యానువల్‌గానే చేపట్టాలి

అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల బదిలీల్లో భాగంగా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ మ్యానువల్‌గానే చేపట్టాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను అనంతపురం నగరంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్జీటీల కౌన్సెలింగ్‌లో మ్యానువల్‌ పద్ధతి పాటించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎదురయ్యే సమస్యలను విన్నవించారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, నాయకులు రాధాకృష్ణారెడ్డి, జీవీ రమణప్ప, గంగాధర్‌ రెడ్డి రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.

మాట తప్పిన కూటమి ప్రభుత్వం 1
1/1

మాట తప్పిన కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement