జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Jun 11 2025 8:47 AM | Updated on Jun 11 2025 8:47 AM

జిల్ల

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.

తుంగభద్ర డ్యాం కళకళ

సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం కళకళలాడుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే ఈ జలాశయంలో రోజు రోజుకూ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన పశ్చిమ కనుమలు, శివమొగ్గ జిల్లాలో జోరుగా వర్షాలు కురవడంతో డ్యాంకు నీటి ప్రవాహం పెరిగింది. జలాశయం సామర్థ్యం వంద టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 25 టీఎంసీలకు చేరినట్లు డ్యాం అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మరో 15 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దాడులకు దిగిన

వారిపై చర్యలు తీసుకోండి

ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు

అనంతపురం: ‘సాక్షి’ చానల్‌ డిబేట్‌లో జరిగిన సంఘటనను సాకుగా తీసుకుని ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్‌ గుండం రామచంద్రా రెడ్డి, బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, సాక్షి టీవీ కరస్పాండెంట్‌ శివా రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పి. జగదీష్‌కు మంగళవారం ఫిర్యాదు అందజేశారు. డిబేట్‌లో జర్నలిస్ట్‌ కృష్ణం రాజు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించగా.. దాన్ని సాక్షి చానల్‌కు ఆపాదించడమే కాక ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి దిగడం దారుణమన్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.ఉద్దేశపూర్వకంగానే జన సమీకరణ చేసి పత్రికా కార్యాలయాలపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమేనని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. 1
1/1

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement