మహిళలపై అత్యాచారాలు, దాడులను ఉపేక్షించం | - | Sakshi
Sakshi News home page

మహిళలపై అత్యాచారాలు, దాడులను ఉపేక్షించం

Jun 11 2025 8:47 AM | Updated on Jun 11 2025 9:39 AM

మహిళలపై అత్యాచారాలు, దాడులను ఉపేక్షించం

మహిళలపై అత్యాచారాలు, దాడులను ఉపేక్షించం

అనంతపురం రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ షెముషి

అనంతపురం: అనంతపురం రేంజ్‌ పరిధిలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయని డీఐజీ డాక్టర్‌ షెముషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఐజీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిన్నపిల్లలు, మహిళలు, బలహీనులపై ఎవరైనా అత్యాచారాలు, దాడులకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పాశవిక ఘటనల్లో పాలుపంచుకునే వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. రౌడీషీట్లు తెరిచి, జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంతమంది రౌడీషీటర్లు అమాయకులను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement