తాడిపత్రి టౌన్: స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీలు తాడిపత్రిలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల కరస్పాండెంట్ సతీష్రెడ్డి, నీలకంఠారెడ్డి పాల్గొన్నారు.
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామానికి చెందిన బుంగ లింగారెడ్డి (75), అదే గ్రామానికి చెందిన హరిజన సాకే వెంకటరమణ ద్రాక్ష కొమ్మల కటింగ్ పనితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రామినేపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై రాప్తాడు వద్ద ఉన్న పెట్రోలు బంక్ వద్దకు చేరుకుని అక్కడ తమ వాహనాలను నిలిపి మిగిలిన కూలీలతో కలసి ఆటోలో ద్రాక్ష తోటలకు వెళ్లి పనులు ముగించుకుని వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం గార్లదిన్నె వద్ద ద్రాక్ష కటింగ్కు వెళ్లాల్సి ఉండడంతో తన స్కూటీపై సాకే వెంకటరమణతో కలసి లింగారెడ్డి బయలుదేరాడు. తెల్లవారుజామున 5.15 గంటలకు రాప్తాడు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఐచర్ షోరూమ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. ఘటనలో బుంగ లింగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన వాహనంతో సహా ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన సాకే వెంకటరమణను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, బుంగ లింగారెడ్డికి భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.
ముగిసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు