
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్–2025కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ జిల్లా కోఆర్డినేటర్ సి.జయచంద్రా రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఉమెన్), ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల (ఏ, బీ సెంటర్లు), ఓటీపీఆర్ఐ, ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, పీవీకేకే డిగ్రీ అండ్ పీజీ కళాశాల, తాడిపత్రి పట్టణంలో ఆరు సెంటర్లు, గుంతకల్లులో నాలుగు, కళ్యాణదుర్గంలో మూడు చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పాలిసెట్ హాల్టికెట్ రానివారు (ఫీజు చెల్లింపు వైఫల్యం, ఫీజు వాపసు కారణంగా) సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కో–ఆర్డినేటర్ను మంగళవారం సాయంత్రం 4 గంటల్లోపు సంప్రదించి, హాల్టికెట్లు పొందవచ్చు. రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకెళ్లాలి. ఆన్లైన్లో హాల్టికెట్ డౌన్ లోడ్ అయి ఉంటే హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు.
నీటి తొట్టెలో పడి బాలుడి మృతి
బ్రహ్మసముద్రం : ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. బ్రహ్మసమ్రుదం మండలం ఎరడికెర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... ఎరడికెరకు చెందిన శివలింగమ్మ, నాగరాజు దంపతుల కుమారుడు హర్షవర్ధన్ (3) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని నీటి నుంచి వెలికి తీసి బ్రహ్మసముద్రంలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్దారించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండాపోయింది.
వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం
తాడిపత్రి రూరల్: స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం నిర్వహించిన వైస్ చైర్మన్ల ఎంపిక సజావుగా ముగిసింది. ఎన్నికల ఆర్ఓ మల్లికార్జున ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఎన్నికలో టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి వైస్ చైర్మన్–1గా, సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ వైస్ చైర్మన్–2గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, విజయ్కుమార్, జింకా లక్ష్మిదేవి బలపరిచారు. నూతన వైస్ చైర్మన్లతో ఆర్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు.
మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పి. నాగమద్దయ్య, జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ మూడు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఒకటి చొప్పున షాపులు ఉన్నాయి. వీటికి సంబంధించి అనంతపురం జిల్లాలోని పది ఎకై ్సజ్ స్టేషన్లలో ఎక్కడైనా దరఖాస్తులు అందజేయవచ్చు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలని మడకశిర నగర పంచాయతీ పరిధిలో రెండు, గుడిబండ మండలంలో ఒకటి, అమరాపురం మండలంలో ఒకటి చొప్పున ఖాళీగా ఉన్న మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ జిల్లా పరిధిలోని 8 ఎకై ్సజ్ స్టేషన్లలో ఎక్కడైనా దరఖాస్తులు అందజేయవచ్చు. రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ దరఖాస్తు రుసుమును డీడీ ద్వారా చెల్లించాలి. అప్లికేషన్కు ఆధార్ కార్డు జత చేసి మే 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలి. అదే నెల 5న ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాలను కేటాయిస్తారు.

పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి